Thursday, 17 September 2026 05:20:41 AM
# చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీ ఆత్మహత్య # ఏపీలో గంజాయి సేవించేవారిని పట్టిస్తే.. రూ.1,500 రివార్డ్! # మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు..

కోతుల బావి వివాదం.. సీఐపై అక్రమ నిర్బంధ ఆరోపణలు..

Date : 12 May 2026 10:25 AM Views : 109

DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఎమ్మిగనూరు పట్టణంలోని శ్రీ కోతుల బావి శ్రీ ఆంజనేయస్వామి గుడి స్థల వివాదం మరోసారి ఉద్రిక్తతకు దారితీసింది. గుడికి అడ్డంగా మున్సిపల్ కమిషనర్ నిర్మించిన నాపరాళ్ల ప్రహరీని ఈ నెల 14న తొలగించేందుకు చేపట్టిన కార్యక్రమం నేపథ్యంలో, ఈ విషయాన్ని వివరించేందుకు వెళ్లిన కోనేరు నాగేంద్ర ప్రసాద్, కసిరెడ్డి ఉపేంద్ర రెడ్డి, బెస్త వీరేష్‌లను సీఐ కంబగిరి రాముడు అక్రమంగా రెండున్నర గంటలపాటు నిర్బంధించారని ఆరోపించారు. కోనేరు నాగేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, కోతుల బావి స్థలం గుడికి చెందినదని, ఇప్పటికే ఆర్డీవో సమక్షంలో సర్వే నిర్వహించి హద్దులు నిర్ణయించారని తెలిపారు. అయినప్పటికీ మున్సిపల్ కమిషనర్ అక్రమంగా నాపబండల ప్రహరీ నిర్మించారని ఆరోపించారు. ఈ విషయాన్ని సీఐకి వివరించినప్పటికీ, ప్రైవేట్ వ్యక్తుల ఫిర్యాదు ఆధారంగా మాట్లాడారని తెలిపారు. 14వ తేదీన బండలను తొలగించి తీరుతామని చెప్పిన నేపథ్యంలో సీఐ పోలీసులను పిలిచి తమపై బైండోవర్ కేసు నమోదు చేయాలని, బయటకు పంపవద్దని ఆదేశించారని ఆరోపించారు. అనంతరం కోనేరు నాగేంద్ర ప్రసాద్, ఉపేంద్ర రెడ్డి, బెస్త వీరేష్‌లను ఎమ్మిగనూరు తహసిల్దార్ శ్రీనివాసులు ఎదుట హాజరు పరిచారు. ఈ సందర్భంగా కోనేరు మాట్లాడుతూ, తమను రెండున్నర గంటలపాటు అక్రమ నిర్బంధంలో ఉంచి, కేసు వివరాలు కూడా తెలియజేయలేదని తెలిపారు. బైండోవర్ కేసుల విషయంలో చట్ట ప్రకారం తహసిల్దార్‌కు కేవలం సిఫారసు లేఖ మాత్రమే పంపాలని, వ్యక్తులను నేరుగా హాజరు పరచడం చట్టవిరుద్ధమని తహసిల్దార్‌కు వివరించినట్లు తెలిపారు. ఇరువర్గాల వాదనలు విన్న తహసిల్దార్ శ్రీనివాసులు ప్రస్తుతం బైండోవర్ చేయడం లేదని, పూర్తి వివరాలు పరిశీలించి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పి వారిని పంపించినట్లు సమాచారం. ఈ వ్యవహారం వెనుక ప్రైవేట్ వ్యక్తులు, రాజకీయ నాయకుల కుట్ర ఉందని, గుడి స్థలాన్ని కబ్జాలో ఉంచుకునేందుకే అడ్డంకులు సృష్టిస్తున్నారని కోనేరు ఆరోపించారు. ప్రజలు ఈ విషయాన్ని గ్రహించి ఈ నెల 14న నిర్వహించే “శ్రీ హనుమ కరసేవ” కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరుకావాలని పిలుపునిచ్చారు. అలాగే సీఐ కంబగిరి రాముడు తమను అక్రమంగా నిర్బంధించిన వ్యవహారంపై ఉన్నతాధికారులు విచారణ జరిపి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, లేకపోతే రాష్ట్ర హైకోర్టును ఆశ్రయిస్తామని కోనేరు నాగేంద్ర ప్రసాద్ హెచ్చరించారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :