DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆదోని పట్టణంలో మహిళల కోసం మరుగుదొడ్ల నిర్మాణం ఆలస్యం అవుతున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. BJP ఏపి రాష్ట్ర అధ్యక్షులు PVN మాధవ్ ఆదేశాల మేరకు, ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ వాల్మీకి పార్థసారథి సూచనలతో ప్రతి సోమవారం నిర్వహించే “జనతా వారధి” కార్యక్రమంలో భాగంగా ఆదోని సబ్ కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు వినితా గుప్తా, తోవి నాగార్జున, మహదేవ్, గోపి, ఉషారాజ్ మాట్లాడుతూ—ఆదోని పట్టణంలోని ఝాన్సీ లక్ష్మీబాయి కూరగాయల మార్కెట్ సమీపంలో GB కాంప్లెక్స్ పక్కన ఉన్న ప్రభుత్వ స్థలంలో, చిన్న మార్కెట్ ప్రాంతంలో మరియు మున్సిపాలిటీ పరిధిలోని పలు ప్రాంతాల్లో మహిళల మరుగుదొడ్ల నిర్మాణానికి రెండేళ్ల క్రితమే ప్రణాళికలు సిద్ధం చేసినప్పటికీ ఇప్పటివరకు పనులు ప్రారంభం కాకపోవడం బాధాకరమని అన్నారు. మరుగుదొడ్ల నిర్మాణానికి మంజూరైన నిధులపై స్పష్టత లేకపోవడం, స్థలాల్లో పనులు ప్రారంభం కాకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. మహిళల గౌరవం, ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వెంటనే సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, అలాగే అత్యవసరంగా మరుగుదొడ్ల నిర్మాణాన్ని ప్రారంభించాలని డిమాండ్ చేశారు. లేకపోతే ప్రజల సమస్యలను దృష్టిలో ఉంచుకుని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు వెనుకాడబోమని గట్టిగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో AV సురేష్ (వార్డ్ మాజీ కౌన్సిలర్, కర్నూలు జిల్లా ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షులు), చంద్ర, రామకృష్ణ, మాధవి, ప్రశాంత్, మహేష్ నాయక్, నాగేష్ తదితరులు పాల్గొన్నారు.
Admin
DNB News