DNB News - ఆంధ్రప్రదేశ్ / : కర్నూలు జిల్లాలో దివ్యాంగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని జిల్లా కలెక్టర్ సిరి ఈరోజు అధికారికంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి గుడిసె ఆది కృష్ణమ్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, దివ్యాంగుల కోసం ప్రభుత్వం తీసుకున్న ఈ మంచి నిర్ణయాన్ని ఆమె అభినందించారు. ఈ పథకం ద్వారా దివ్యాంగులకు సౌకర్యవంతమైన ప్రయాణం కల్పించబడడంతో పాటు వారి దైనందిన జీవితంలో మరింత సౌలభ్యం కలుగుతుందని పేర్కొన్నారు. అలాగే, దివ్యాంగులతో మమేకమై వారి సమస్యలను తెలుసుకుని, ప్రభుత్వం తరఫున మరింత సహాయం అందేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎం , చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు , బొందలీ చైర్మన్ విక్రమ్ సింగ్, దివ్యాంగుల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎల్లప్ప, డైరెక్టర్లు మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు.
Admin
DNB News