DNB News - ఆంధ్రప్రదేశ్ / : నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎం రిలీఫ్ ఫండ్) ఒక వరమని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి పేర్కొన్నారు. గురువారం ఆదోని లోని తన క్యాంపు కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకున్న 50 మంది లబ్ధిదారులకు మొత్తం రూ.18,72,942 విలువైన చెక్కులను అందజేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వైద్యానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారని చెప్పారు. ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించకూడదని సూచించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన నాయకులు మరియు గ్రామ స్థాయి కూటమి నాయకులు పాల్గొన్నారు.
Admin
DNB News