Sunday, 20 September 2026 07:17:57 AM
# చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీ ఆత్మహత్య # ఏపీలో గంజాయి సేవించేవారిని పట్టిస్తే.. రూ.1,500 రివార్డ్! # మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు..

ఆదోని జిల్లాగా ప్రకటించాలని 104వ రోజు రిలే నిరాహార దీక్ష

Date : 28 February 2026 11:28 AM Views : 134

DNB News - ఆంధ్రప్రదేశ్ / : MRPS ఆధ్వర్యంలో ఆదోని జిల్లా సాధన కోసం కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు 104వ రోజుకు చేరుకున్నాయి. ఆదోని జిల్లా సాధన జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు ఆదోని ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు డిస్ట్రిక్ట్ పశ్చిమ ప్రాంతం అత్యంత వెనుకబడిన ప్రాంతమని పేర్కొంటూ, ఆదోని జిల్లా కేంద్రంగా ఐదు నియోజకవర్గాలను కలిపి కొత్త జిల్లా ఏర్పాటు చేయాలని వివిధ ఉద్యమ కార్యక్రమాల ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఇప్పటివరకు నిర్ణయం తీసుకోకపోవడం బాధాకరమని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆదోని జిల్లాగా ప్రకటించాలని వారు కోరారు. రైతుల అభివృద్ధి, విద్యార్థులకు నాణ్యమైన విద్య, సామాన్య ప్రజలకు మెరుగైన వైద్యం, ఉన్నత విద్య పొందిన నిరుద్యోగులకు ఉపాధి కల్పన కోసం పరిశ్రమల ఏర్పాటు, ఐదు నియోజకవర్గాల్లో రోడ్ల సమస్యల పరిష్కారం, ఆదోని పట్టణ రోడ్ల విస్తరణ వంటి అంశాల దృష్ట్యా ఆదోనిని జిల్లాగా ప్రకటించడం అత్యవసరమని జేఏసీ నాయకులు తెలిపారు. 104వ రోజు రిలే నిరాహార దీక్షలో ఎంఆర్పీఎస్ సంఘం నాయకులు జగన్ మాదిగ, కిరణ్ మాదిగ, భూదెబ్బ మాదిగ, పిఎస్ వీరేష్ మాదిగ, దత్తు మాదిగలతో పాటు జిల్లా సాధన జేఏసీ నాయకులు షకీల్ దీక్షలో కూర్చొన్నారు. ఈ కార్యక్రమానికి మద్దతుగా జేఏసీ నాయకులు పగడాల కోదండ, బండారి హనుమంతు మాదిగ, గమ్మల బాలస్వామి మాదిగ, వై.పి. నాగరాజు, దాసరి గోవిందు, దాసరి నరేష్, కుమార్, వైఎస్ఆర్ నగర్ రామకృష్ణ, నరేష్ యాదవ్, సుజ్ఞానమ్మ, సుభాష్, రామలింగయ్య (బీఎస్పీ) తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: