DNB News - ఆంధ్రప్రదేశ్ / : కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ ఆదేశాల మేరకు జిల్లాలో మహిళలు, బాలల రక్షణ, సైబర్ నేరాల నివారణ, ట్రాఫిక్ భద్రత మరియు పోలీస్ సేవలపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు విస్తృత స్థాయిలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పాఠశాలలు, పట్టణాలు మరియు గ్రామాలను సందర్శించిన సీఐలు, ఎస్సైలు, జీఎంఎస్కే సిబ్బంది కలిసి వివిధ అవగాహన సమావేశాలు నిర్వహించారు. మహిళలపై జరుగుతున్న నేరాలు, బాల్య వివాహాల నిరోధం, గుడ్ టచ్ – బ్యాడ్ టచ్ అంశాలపై అవగాహన కల్పించారు. ఈవ్ టీజింగ్ నియంత్రణ, సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాలు, ట్రాఫిక్ నిబంధనలు మరియు పోలీస్ సేవల గురించి ప్రజలకు వివరించారు. అనుమానాస్పద సంఘటనలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. శక్తి యాప్ వినియోగం, అత్యవసర పరిస్థితుల్లో డయల్ 112, డయల్ 100, 1930 సైబర్ క్రైమ్ హెల్ప్లైన్ సేవల గురించి సమగ్రంగా తెలియజేశారు. ప్రజల భద్రతే లక్ష్యంగా జిల్లా పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారని అధికారులు తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయం, కర్నూలు
Admin
DNB News