DNB News - ఆంధ్రప్రదేశ్ / : జాతీయ మహిళా వైద్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎమ్మిగనూరు నగరంలోని ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో మహిళా వైద్యులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మహిళా వైద్యుల సేవలను కొనియాడుతూ, వారి అంకితభావం, త్యాగం సమాజానికి ఆదర్శమని వక్తలు పేర్కొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ బైలుప్పల షఫీయుల్లా మహిళా వైద్యులను శాలువాలతో సత్కరించి పుష్పగుచ్ఛాలు అందజేశారు. వైద్య రంగంలో మహిళలు కీలక పాత్ర పోషిస్తూ ప్రజారోగ్య పరిరక్షణలో ముందుండటం అభినందనీయమని ఆయన అన్నారు. మహిళా వైద్యులు రోగులకు అందిస్తున్న నిరంతర సేవలు ఆరోగ్య వ్యవస్థకు బలంగా నిలుస్తున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన వైద్యశాల సిబ్బంది, నర్సింగ్ సిబ్బంది తదితరులు పాల్గొని మహిళా వైద్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
Admin
DNB News