Thursday, 23 April 2026 04:04:50 PM
# సూర్యాపేట్ జిల్లా నడిగూడెం మండలం కార్యాలయంలో పార్టీ కార్యకర్తలతో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్న - బొల్లం మల్లయ్య యాదవ్ # శ్రీ భగీరథ మహర్షి ఆశయాలు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం... జిల్లా బీసీ అభివృద్ధి అధికారి జ్యోతి # శాంతియుత వాతావరణంతో పరిశుభ్రమైన నగరంగా ఆదర్శంగా ఖమ్మం నిలిచేలా చర్యలు # కోదాడ ఆర్టీసీ డిపో వద్ద తమ సమస్యల పరిష్కారానికి సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు సంఘీభావం తెలపడం జరిగింది. # శ్రీ రామానుజాచార్యుల 1009 జయంతి సందర్భంగా. ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించిన. గ్రామ సర్పంచ్ డాక్టర్ వేమూరి సత్యనారాయణ. # తెలంగాణ వడ్డెర సంఘం అండ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మునగాల మండలం నాయకులు గోగుల లక్ష్మణ్ వడ్డెర చైతన్య యాత్ర # నషా ముక్త్ భారత్ అవగాహన వాకథాన్‌లో కలెక్టర్, ఎస్పీ పాల్గొనడం... # జస్టిస్ పిసీ ఘోష్ కమిషన్ పై హైకోర్టు తీర్పుతో న్యాయం గెలిచింది # ఉపాధి హామీ చట్టం కూలీలకు వరం లాంటిది జి రాంజీ పథకం కూలీలకు వ్యతిరేకమైనది జి రామ్ జి రద్దుకై ఉద్యమిద్దాం ములకలపల్లి రాములు పిలుపు # జగన్నాధపురం గ్రామంలో పోలీస్ ప్రజా భరోసా కార్యక్రమం.. # విజయలక్ష్మి సమేత కనకదుర్గా దేవాలయం వావిలాలపల్లి, కరీంనగర్ సధ్వజ పరివార స్థిర ప్రతిష్టా మహోత్సవం # ​లైసెన్స్ లేకుండా టీవీఎస్ ఎక్స్‌ఎల్ నడిపితే చర్యలు: 140 వాహనాల సీజ్ - ట్రాఫిక్ ఏసీపీ యాదగిరిస్వామి # ఖమ్మం జిల్లా పేదప్రజలకు అండగా శ్రీచక్ర హాస్పిటల్. # డ్రాయింగ్ బుక్స్, స్కెచ్ పెన్నులు , కుక్కర్ ను అందించిన కార్పొరేటర్ మాసం గణేష్ # నగరంలోని అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలి.-తుమ్మల నాగేశ్వరరావు # ఆదోని మేక వంక ఆక్రమణలపై ఆగ్రహం – సిమెంట్ కాలువ తొలగించాలంటూ నూర్ అహ్మద్ డిమాండ్... # పత్తికొండలో OHSR ట్యాంక్ పరిశీలన – నీటి నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టిన జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి... # ఎన్.టి.ఎల్. సంస్థ ఆధ్వర్యంలో ఇందిరా అనాధ వృద్ధాశ్రమంలో 19000/ వేలరూపాయల నిత్యవసర సరుకులు అందజేత # నంద్యాలలో SDPI లీడర్స్ కాన్క్లేవ్ – ఆదోని యూనిట్ చురుకైన భాగస్వామ్యం.. # చైన్ స్నాచింగ్ కేసు ఛేదన – నిందితుడి అరెస్ట్, పల్సర్ బైక్ స్వాధీనం..

జగన్నాధపురం గ్రామంలో పోలీస్ ప్రజా భరోసా కార్యక్రమం..

Date : 23 April 2026 09:58 AM Views : 55

DNB News - తెలంగాణ / : మునగాల:ప్రజలకు చట్టాల గురించి వివరించడం శాంతి యుత సమాజం కోసం, శాంతియుత గ్రామం కోసం జిల్లా ఎస్పి నరసింహ ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు మునగాల పోలీసులు పోలీసు ప్రజా భరోసా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగినది. పోలీసు ప్రజా భరోసా కార్యక్రమంలో భాగంగా మునగాల మండలం జగన్నాధపురం గ్రామంలో మునగాల పోలీసులు ఎస్ఐ ప్రవీణ్ కుమార్ అధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి కోదాడ డివిజన్ డిఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, మునగాల సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణా రెడ్డి హాజరై చట్టాల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. గ్రామంలో ప్రజలు అందరు కలిసిమెలిసి ఉండాలి, సమస్యలు ఉంటే సామరస్యంగా పరిష్కరించుకోవాలి, జీవితంలో తప్పటడుగు వేస్తే మళ్ళీ సరిదిద్దుకోవటం చాలా కష్టం అవుతుంది అని డిఎస్పీ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. రోడ్డు ప్రమాదాలలో ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారు, జాగ్రత్తగా వాహనాలు నడపాలి, ద్విచక్ర వాహనాలపై ప్రయాణం చేసే వారు హెల్మెట్ ధరించాలి, పెద్ద వాహనాల్లో సీట్ బెల్ట్ పెట్టుకోవాలి అని డిఎస్పీ అన్నారు. చదువు విలువను గుర్తించాలి, యువత, విద్యార్థులు ప్రతి ఒక్కరూ లక్ష్యంతో చదువుకోవాలి ఉన్నత స్థాయికి ఎదగాలి, గ్రామానికి, తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలి అన్నారు. తప్పులు, నేరాలకు పాల్పడితే చట్టంలో ఎలాంటి శిక్షలు ఉన్నాయి అనేది చట్టం రూపొందించారు, చట్టానికి లోబడి నడుచుకోకపోతే, క్షణికావేశంలో, క్షేణిక అందంకోసం తప్పులు, నేరాలు చేస్తే జీవితకాలం జైలు శిక్షలు అనుభవించాల్సి వస్తుంది అన్నారు. తగాదాలు, గొడవలు ఉంటే చట్టపరిధిలో పరిష్కరించుకోవాలి అన్నారు. అత్యాశకు పోయి సైబర్ మోసగాళ్ళకు చిక్కితే ఆర్థికంగా లూటీ చేస్తారు, తక్కువ వడ్డీకి లోన్ వచ్చినది ప్రాసేసింగ్ ఫీజు కట్టాలి అంటే నమ్మి డబ్బులు చెల్లించవద్దు, మీరు డ్రగ్స్ కేసులో, ఇతర డిజిటల్ కేసులో చిక్కుకున్నారు అని CBI, CID పోలీస్ అధికారులం మాట్లాడుతున్నాను మిమ్ములను అరెస్టు చేస్తాము అని బయపెడతారు, కేసు నుండి తప్పిస్తం డబ్బులు కట్టాలి అంటారు భయపడి డబ్బులు కట్టవద్దు డిజిటల్ అరెస్టు అనేది అబద్ధం అన్నారు. నేరాల్లో చిక్కుకోవడం వల్ల యువత భవిష్యత్తులో ఉద్యోగాలు పొందే విషయంలో విదేశాలకు వెళ్లే విషయంలో పై చదువుల విషయంలో సమస్యలు వస్తాయి. మద్యం మత్తులో వాహనాలు నడపవద్దు రోడ్డు భద్రత చర్యలు తీసుకోవాలి, అజాగ్రత్తగా మద్యం మత్తులో, అధిక వేగం తో, నిర్లక్ష్యంగా వాహనాలు తొలడం వల్ల రోడ్డు ప్రమాదాల జరిగి ప్రాణాలు కోల్పోతున్నారు. అత్యాశకు పోయి సైబర్ మోసాల బారిన పడి డబ్బు కోగొట్టుకుంటున్నారు. మత్తు పదార్థాలకు బానిసలై యువత మంచి భవిష్యత్తును కోల్పోతుంది అన్నారు. జాగ్రత్తగా ఉండాలి చట్టానికి లోబడి ఉండాలి, సమస్యలు వస్తె సామరస్యంగా పరిష్కరించుకోవాలి, పోలీసులను, అధికారులను ఆశ్రయించాలి, చట్టాన్ని ఉల్లంఘిస్తే జైలుకు వెళ్లాల్సి వస్తుంది అన్నారు. అలవాటుగా నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయి, బైండోవర్ చేస్తాము, షీట్ నమోదు చేస్తాము అన్నారు. సామాజిక అంశాలపై పోలీసు కళాబృందం వారు సామాజిక అంశాల పట్ల ఆట పాటలతో అవగాహన కల్పించారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :