DNB News - తెలంగాణ / : మునగాల:ప్రతివిద్యార్థి బాల్యంలో చదువుపై శ్రద్ధ పెట్టి కష్టపడి చదువుకుంటేనే జీవితంలో సుఖ సంతోషంతో జీవించవచ్చు అని సీఐ రామకృష్ణారెడ్డి అన్నారు, గురువారం స్థానిక తెలంగాణ మోడల్ స్కూల్ మునగాల నందు బాలల చట్టాలపై అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు, ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం బాలల హక్కుల రక్షణకు అనేక చట్టాలు తెచ్చిందని వీటి ద్వారా బాల్య వివాహాల నివారణ, అనాధ బాలలను గుర్తించి పునరావాసం కల్పించడం,బాలలపై లైంగిక వేధింపులు అరికట్టడం, మాదకద్రవ్యాలు మత్తుపదార్థాలు బారిన పడకుండా కాపాడడం, మొదలగునవి ఈచట్టాల ద్వారా చేయవచ్చు అని,అందుకు చట్టాలపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలన్నారు, అదేవిధంగా నేటి విద్యార్థులు సోషల్ మీడియాకు బానిసలవుతున్నారనిఫలితంగా బంగారు భవిష్యత్తు ప్రశ్నార్ధకమవుతుందన్నారు, కాబట్టి విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టి, కష్టపడి చదివి ప్రతి ఒక్కరూ ఉన్నత ర్యాంకులు సాధించేందుకు కృషి చేయాలన్నారు. పాఠశాల ప్రిన్సిపల్ బూర సైదయ్య గౌడ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జిల్లా బాలల హక్కుల సంరక్షణ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు, పాఠశాలఅధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Admin
DNB News