DNB News - తెలంగాణ / : ఇంటర్మీడియట్ పేపర్ వాల్యుయేషన్ క్యాంపును నాగర్ కర్నూలు జిల్లాకు ఇవ్వాలని మంత్రి జూపల్లి కృష్ణారావుకి వినతి పత్రాన్ని అందజేసిన..ప్రైవేట్ కళాశాలల యజమాన్య సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు సురగౌని శ్రీనివాస్ గౌడ్ ప్రభుత్వ లెక్చరర్ల సంఘం నాగర్ కర్నూల్ జిల్లా జనరల్ సెక్రటరీ రవికుమార్ .ఇంటర్మీడియట్ పేపర్ వాల్యుయేషన్ క్యాంపును నాగర్ కర్నూల్ జిల్లాకు ఇవ్వాలని మంత్రివ జూపల్లి కృష్ణారావు కి జిల్లా అధ్యాపకుల ఆధ్వర్యంలో ఈరోజు ప్రైవేట్ కళాశాలల యజమాన్య సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు సురగౌని శ్రీనివాస్ గౌడ్ , ప్రభుత్వ లెక్చరర్ల సంఘం నాగర్ కర్నూల్ జిల్లా జనరల్ సెక్రటరీ రవికుమార్ వినతి పత్రాన్ని అందజేశారు రాబోయే ఇంటర్ మీడియట్ పబ్లిక్ పరీక్షలో పేపర్ వాల్యుయేషన్ క్యాంపు మహబూబ్నగర్ ఇవ్వడం వల్ల సుదూర ప్రాంతాల నుండి లెక్చరర్లు పేపర్ వాల్యుయేషన కు వెళ్లడానికి ఇబ్బంది పడుతున్నారని కావున ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పెద్ద జిల్లా అయిన నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో క్యాంపును ఏర్పాటు చేయడం వల్ల జిల్లాలోని అధ్యాపకులందరికీ వాల్యుయేషన్ కు రాకపోకలు సులువుగా ప్రశాంత వాతావరణంలో పేపర్లో దిద్దడానికి అనుకూలంగా ఉంటుందని కావున నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రo లో ఇంటర్ వాల్యుయేషన్ క్యాంపు ఏర్పాటు చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని ఇంటర్ అధికారులను ఆదేశించాలని వినతి పత్రంలో పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో అధ్యాపకులు దశరథం. శ్రీనివాసరావు ,కురుమూర్తి. తదితరులు పాల్గొన్నారు..._
Admin
DNB News