DNB News - తెలంగాణ / : సామాజిక న్యాయం, మానవ హక్కుల పరిరక్షణ మరియు భారతదేశ మార్పు కోసం సామాజిక సేవ చేసిన పలువురికి "జ్యోతిరావు పూలే - జ్ఞానసూర్యుడు అంబేడ్కర్" అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా హైకోర్టు అడ్వకేట్ లీగల్ అడ్వైజర్ బట్టు శ్రీనివాస్, ఆల్ ఇండియా ముస్లిం మైనారిటీ ఫోరమ్ అధ్యక్షులు షేక్ ఇస్లాముద్దీన్, మరియు హ్యూమన్ రైట్స్ అధ్యక్షులు మంగళపెల్లి హుస్సేన్ హాజరయ్యారు.ముఖ్య అతిధుల ప్రసంగం:ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. "ఈ దేశం మనకు ఏమి ఇచ్చింది కాదు, మనం దేశానికి ఏమి ఇచ్చాం అనేదే ముఖ్యం" అనే గొప్ప భావనతో ప్రతి ఒక్కరూ సామాజిక సేవలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. గతంలో హైదరాబాద్లో ఇలాంటి కార్యక్రమాలను జరిపామని, ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు కరీంనగర్ లాంటి పెద్ద జిల్లాలో ఈ వేడుకలను నిర్వహించడం ఎంతో గర్వకారణంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు.సమాజంలో ప్రతి ఒక్కరికీ మానవ హక్కుల గురించి పూర్తి అవగాహన ఉండాలని వారు పేర్కొన్నారు. సమాజ మార్పు కోసం, న్యాయం కోసం నిరంతరం శ్రమించిన మహాత్మా జ్యోతిరావు పూలే, డా. బి.ఆర్. అంబేడ్కర్ ఆశయాలను, వారి జీవిత విశేషాలను నేటి తరం తప్పక తెలుసుకోవాలని మరియు వారి అడుగుజాడల్లో నడవాలని అతిథులు ఆకాంక్షించారు.ఈ వేడుకల్లో అవార్డు గ్రహీతలు, సామాజిక కార్యకర్తలు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమం లో మిట్టపెల్లి రాజు కుమార్, తెలంగాణ వైస్ ప్రెసిడెంట్, పొన్నల తిరుపతి,స్టేట్ ఎగ్జిట్వ్ మెంబెర్,జట్టు పల్లి అనిల్ కుమార్ జిల్లా అధ్యక్షులు, కాల్వ మధుబాబు,కరీంనగర్ జిల్లా కో ఆర్డినేటర్,పొన్నాల శంకర్,వైస్ ప్రెసిడెంట్, కుంట సుజాత, జాయింట్ సెక్రటరీ, వొగెటి సుహాసిని, ప్రెసిడెంట్, కరింగుల సుజాత, జనరల్ సెక్రటరీ,తదితరులు పాల్గొన్నారు.
Admin
DNB News