DNB News - తెలంగాణ / : హకీంపేట స్పోర్ట్స్ స్కూల్ 7వ తరగతి విద్యార్ధి ఉమేష్ ఆత్మహత్య యత్నానికి పాల్పడగా, పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వెల్ నెస్ హాస్పిటల్ లో విద్యార్థికి చికిత్స అందిస్తున్నారు. ఇతర కార్యక్రమాల్లో ఉన్న మంత్రి వాకిటి శ్రీహరి అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకొన వెల్ నెస్ హాస్పిటల్ కు వచ్చి విద్యార్ధిని పరామర్శించారు. విద్యార్థికి అందుతున్న చికిత్సను స్వయంగా డాక్టర్లను అడిగి తెలుసుకొని, మెరుగైన వైద్యం అందించాలని మంత్రి ఆదేశించారు. విద్యార్ధి ఆరోగ్యం మెరుగుపడే వరకు ప్రభుత్వమే వైద్య ఖర్చులు భరిస్తుందని మంత్రి తెలిపారు. చికిత్స విషయంలో ఎలాంటి వెనకడుకు వేయవద్దని మంత్రి వైద్యులకు సూచించారు. విద్యార్ధి ఆత్మయత్నానికి సంబంధించి విచారణ చేయాలని రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డితో ఫోన్ లో మాట్లాడిన మంత్రి వాకిటి శ్రీహరి విద్యార్ధి ఆత్మహత్యాయత్నానికి సంబంధించిన కారణాలపై నిష్పక్షపాతంగా విచారణ చేయాలని డీజీపీకి తెలిపిన మంత్రి వాకిటి శ్రీహరి విద్యార్ధి తల్లిదండ్రులకు ధైర్యం చెప్పిన మంత్రి వాకిటి శ్రీహరి మంత్రితో పాటు స్పోర్ట్స్ అథారిటీ MD సోనీ బాలాదేవి, ఇతర అధికారులు ఉన్నారు.
Admin
DNB News