DNB News - తెలంగాణ / : సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం గత నాలుగు రోజులుగా హైదరాబాద్లోని AIG Hospitalsలో గుండె సంబంధిత సమస్యలతో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన ఐసీయూలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఊపిరితిత్తుల్లో నీరు చేరడం సహా కొన్ని ఆరోగ్య సమస్యలతో ఆయన బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపారు. ఈ నేపథ్యంలో పార్టీ పోలిట్బ్యూరో సభ్యులు బి.వి. రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, పార్టీ నాయకులు బి. వెంకట్, టి. సాగర్, ఎం.డి. అబ్బాస్, భూపాల్, ఆర్. వెంకట్రాములు, పి. జయలక్ష్మి ఆస్పత్రికి వెళ్లి తమ్మినేని వీరభద్రాన్ని పరామర్శించారు. వైద్యులు అవసరమైన చికిత్స అందిస్తున్నారని, ఆయన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని తెలిపారు. మరో రెండు రోజుల్లో పూర్తిగా కోలుకునే అవకాశముందని వైద్యులు వెల్లడించారు. ఈ విషయాన్ని పార్టీ ఆఫీస్ కార్యదర్శి జె. బాబూరావు వెల్లడించారు.
Admin
DNB News