DNB News - తెలంగాణ / : కల్లూరు ఏసీపీ కార్యాలయం ఖమ్మం... *నకిలీ బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టి 9 లక్షలకు పైగా బ్యాంకు రుణాలు పొందిన ముగ్గురు ఇప్పటికే అరెస్టు కాగా పరారీలో ఉన్న A2 శ్రీపాధి మౌనిక అరెస్ట్ : కల్లూరు ఏసీపీ ఖమ్మం జిల్లా ఏన్కూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తెలంగాణ గ్రామీణ బ్యాంక్, ఏన్కూర్ శాఖలో 2024 సంవత్సరంలో జరిగిన గోల్డ్ లోన్ మోసం కేసులో, ఈ రోజు నిందితురాలు శ్రీపాది మౌనిక (A2)ను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపించడం జరిగింది. ఇప్పటికే ఈ కేసులో నిందితులు శ్రీపాది సతీష్ (A1), రామచంద్రోజు జయమ్మ (A3), రామచంద్రోజు నరేష్ (A4)లను అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగింది. ఈ కేసులో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఏన్కూర్ శాఖ బ్రాంచ్ మేనేజర్ శ్రీ కె.వి. ప్రశాంత్ రెడ్డి గారు ఫిర్యాదు ఇవ్వగా, వెంటనే కేసు నమోదు చేసి వేగవంతంగా దర్యాప్తు చేపట్టడం జరిగింది. దర్యాప్తులో భాగంగా బ్యాంక్ గోల్డ్ అప్రైజర్ శ్రీపాది సతీష్ (A1) తన భార్య శ్రీపాది మౌనిక (A2), సతీష్ అత్తగారు రామచంద్రోజు జయమ్మ (A3), సతీష్ బావమరిది శ్రీ రామచంద్రోజు నరేష్ (A4) లతో కలిసి సుమారు 242.25 గ్రాముల నకిలీ బంగారు ఆభరణాలను అసలైనవిగా చూపించి మొత్తం రూ. 9,53,000/- గోల్డ్ లోన్లు పొందినట్లు విచారణలో నిర్ధారించబడింది. లోన్లు చెల్లించకపోవడంతో ఖాతాలు NPAగా మారగా, బ్యాంకు వారు నిర్వహించిన వేలంలో ఆభరణాలు నకిలీవని గుర్తించబడింది. దర్యాప్తులో మరింతగా తెలిసినదేమనగా, గతంలో ఏన్కూర్ లో శ్రీపాది సతీష్ (A1) మరియు రామచంద్రోజు నరేష్ (A4) లు కలిసి “మౌనిక జ్యువలరీ షాప్” పేరుతో వ్యాపారం నిర్వహిస్తూ కొంతమంది ప్రజలను మోసం చేసినట్లు కూడా వెలుగులోకి వచ్చింది.ఈ విషయం పై అందిన ఫిర్యాదుల పై కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. ప్రజలకు విజ్ఞప్తి ఏమనగా, బ్యాంకుల్లో గోల్డ్ లోన్లు తీసుకునే సమయంలో నకిలీ ఆభరణాలు వినియోగిస్తే కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నాము. ఎవరైనా ఇటువంటి మోసపూరిత చర్యలకు పాల్పడితే చట్టప్రకారం చర్యలు తప్పని ఏసీపీ అన్నారు.
Admin
DNB News