DNB News - తెలంగాణ / : రంజాన్ పండగ సందర్భంగా ముస్లిం సోదరులకు సేమియా పంపిణీ చేశారు. రంజాన్ పండగను సోదరభావంతో జరుపుకోవాలనే ఉద్దేశంతో ఆటో డ్రైవర్లు కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆటో స్టాండ్ సభ్యులు మాట్లాడుతూ రంజాన్ పండగ ముస్లిం సోదరులకు ఎంతో పవిత్రమైనదని, అందరూ ఆనందంగా పండగను జరుపుకోవాలని ఆకాంక్షించారు. మత సామరస్యానికి ప్రతీకగా సేమియా పంపిణీ చేయడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో అశోక్ ఆటో స్టాండ్కు చెందిన ఆటో డ్రైవర్లు, స్థానికులు మరియు ముస్లిం సోదరులు పాల్గొన్నారు. సేమియా పంపిణీతో అక్కడ పండగ వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు ఎస్.కె. మౌలాలి. కనకం, సూరిబాబు చొల్లంగి . శ్రీనివాస్ . బి. రమేష్ ఎం. రమేష్ శ్రీను ప్రభాకర్ సోఒన్ బాబు పి. ఉదయ్ కుమార్ గట్టయ్య గోవిందు అమల్ రాజ్ సములు సత్తులు, ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు
Admin
DNB News