DNB News - తెలంగాణ / : తిరుమలాయపాలెం మండలం గోల్తండా గ్రామంలో 22/05/2026 న గోల్ తండా నివాసి బానోత్ మీనాక్షి భర్త శివాజి అను ఈమె ఉరివేసుకొని చనిపోయిన విషయం విదితమే అట్టి విషయంపై మీనాక్షి తల్లి గుగులోత్ భారతి భర్త రంగా తిరుమలాయపాలెం పోలీస్ స్టేషన్లో పిటిషన్ ఇచ్చారు మీనాక్షి చనిపోవడానికి ఆమె భర్త బానోత్ శివాజీ , గంట లక్ష్మి , అత్తమామ బానోత్ శ్రీను ,బానోత్ దుబ్లీల యొక్క చిత్రహింసలే కారణం అని పిటిషన్ లో పేర్కొనడం జరిగినది. ఈ విషయంలో తిరుమలాయపాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగించి అనంతరం నిందితులైన, బానోత్ శివాజీ తండ్రి శ్రీను , అత్తమామలైన బానోత్ శ్రీను ,బానోత్ దుబ్లీ భర్త శ్రీను లను బుధవారం తిరుమలాయపాలెం పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ కూచిపూడి జగదీశ్ అట్టి వారిని అరెస్ట్ చేసి కోర్ట్ నందు హాజరు పరిచి రిమాండ్కి తరలించడం జరిగినది . A2 అయిన గంటా లక్ష్మి బుధవారం కోర్టులో లొంగిపోవడం జరిగినది.
Admin
DNB News