Friday, 17 April 2026 05:03:38 PM
# ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలి. # టి డి పి రాష్ట్ర అధ్యక్షులుగా రెండవసారి నియమితులైన పల్లా శ్రీనివాసరావు సన్మానించి, శుభాకాంక్షలు తెలిపిన బొండా యల్లాజీరావు, శ్రీదేవి లు # శాతవాహన అభివృద్ధికి కృషి - నూతన కార్యనిర్వాహక మండలి సభ్యులు # కాంగ్రెస్ సీనియర్ మైనార్టీ మహిళా నాయకురాలు సమాన మహమ్మద్ # గోడౌన్ నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించిన రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు.. # ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి లో ఫ్రీజర్ పని చేయక పోవడం తో చనిపోయిన వారు పరిస్థితి దారుణం # తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు లో ఓ ఇంట్లో చోరీ # బిజెపి మండల ప్రధాన కార్యదర్శిగా భాషబోయిన ప్రదీప్ యాదవ్ నియామకం # ఘనంగా కిసాన్ నగర్ హిందూ సమ్మేళనం # ప్రాణహాని బెదిరింపుల నేపథ్యంలో పోలీసు రక్షణ కోరిన బి. జాఫర్.. # “మీ రక్షణ – మా బాధ్యత” అవగాహన ర్యాలీకి శ్రీకారం – మహిళల భద్రతపై కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ పిలుపు.. # 10 సూత్రాల అమలుపై సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి.. # సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ # ఆకుపాముల గ్రామంలోని మాంటిస్సోరీ పాఠశాలలో "సురక్షితంగా ఇంటికి చేరుదాం ‘Arrive and Alive’" అవగాహన కార్యక్రమం # కొత్తగూడెం అరైవ్ అలైవ్ - రోడ్ సేఫ్టీ కార్యక్రమం # ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య # కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి, 12 మందికి గాయాలు # కుమార్తెను చంపి.. తాను ఆత్మహత్య చేసుకున్న తల్లి # రోడ్డుపై మొక్కజొన్నలు..! ద్విచక్రవాహనదారుడికి గాయాలు # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలి : జారే ఆదినారాయణ

ఆన్‌సైట్ ఎఫ్‌ఐఆర్‌ తో బాధితుల వద్దకే వెళ్లి సత్వర న్యాయం.

Date : 05 April 2026 05:07 PM Views : 15

DNB News - తెలంగాణ / : మహబూబాబాద్ జిల్లా ఆన్‌సైట్ ఎఫ్‌ఐఆర్‌ తో బాధితుల వద్దకే వెళ్లి సత్వర న్యాయం. బాధితులు ఈ సేవను వినియోగించుకోవాలి. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 35 కేసులు నమోదు – జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్ బాధితులకు సత్వర న్యాయం అందించాలనే లక్ష్యంతో మహబూబాబాద్ జిల్లా పోలీసులు అమలు చేస్తున్న “ఆన్‌సైట్ ఎఫ్‌ఐఆర్” విధానం ద్వారా ప్రజలకు మరింత చేరువగా పోలీస్ సేవలు అందుతున్నాయి. పోలీస్ స్టేషన్‌కు రాలేని పరిస్థితుల్లో ఉన్న బాధితులు స్టేషన్‌కు రావాల్సిన అవసరం లేకుండా, పోలీసులు స్వయంగా ఘటన స్థలానికి లేదా బాధితుని వద్దకు వెళ్లి ఫిర్యాదు నమోదు చేయడం ఈ విధానం ప్రత్యేకత. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్ మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 35 ఆన్‌సైట్ ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. ఈ విధానం వల్ల బాధితులకు తక్షణ న్యాయం అందడమే కాకుండా, పోలీస్ సేవలపై ప్రజల్లో విశ్వాసం మరింత పెరుగుతోందని అన్నారు. ఆన్‌సైట్ ఎఫ్‌ఐఆర్ నమోదు చేయగల ప్రధాన అంశాలు : 1. మహిళలు మరియు చిన్నారులపై నేరాలు 2. లైంగిక నేరాలు (POCSO, అత్యాచారం తదితరాలు) 3. ఎస్సీ / ఎస్టీ అఘాయిత్యాలు 4. ఆస్తి సంబంధిత నేరాలు (చోరీ, దోపిడీ) 5. వృద్ధులపై నేరాలు 6. ప్రత్యేక చట్టాల కింద కేసులు (డౌరీ, చైల్డ్ మ్యారేజ్, ర్యాగింగ్ మొదలైనవి) 7. పోలీస్ స్టేషన్‌కు రాలేని పరిస్థితిలో ఉన్న బాధితులకు సంబంధించిన ఇతర నేరాలు ప్రత్యేకించి మహిళలు, వృద్ధులు మరియు దూర ప్రాంతాల్లో నివసించే ప్రజలకు ఈ సేవ ఎంతో ఉపయోగకరంగా నిలుస్తోందని ఎస్పీ తెలిపారు. బాధితుని వద్దకే చేరుకుని ఫిర్యాదు నమోదు చేయడం ద్వారా సమయాన్ని ఆదా చేయడంతో పాటు, నేరాలపై వేగంగా చర్యలు తీసుకునే అవకాశం కలుగుతోందని పేర్కొన్నారు. “బాధితులకు సత్వర న్యాయం అందించడమే పోలీస్ శాఖ లక్ష్యం. ప్రజలకు చేరువగా ఉండే పోలీసింగ్‌ ద్వారా వారి సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు కట్టుబడి ఉన్నాము,” అని జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్ తెలిపారు. మహబూబాబాద్ జిల్లా ప్రజలు ఈ సేవను వినియోగించుకుని నిర్భయంగా ముందుకు వచ్చి పోలీసులను సంప్రదించాలని ఎస్పీ కోరారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :