DNB News - తెలంగాణ / : తిరుమలాయపాలెం మండల పరిధిలోని పైనంపల్లి గ్రామంలో శ్రీరామనవమి పండుగ ఉత్సవాన్ని నూతన సర్పంచి ధారావత్ సరోజినీ శంకర్ నాయక్ ఆధ్వర్యంలో ప్రజలందరూ కన్నుల పండుగగా అంగరంగ వైభవంగా శ్రీ సీతారామచంద్రమూర్తి పెళ్లి వేడుకను నిర్వహించుకున్నారు. సీతారామచంద్రమూర్తి కళ్యాణానికి ఊర్లోని ఆడపడుచులు చిన్నలు పెద్దలు భక్తి భావంతో అధిక సంఖ్యలో పాల్గొని సీతమ్మ రాములవారి పెండ్లి ఉత్సవాన్ని చూసి గ్రామంలోని ప్రజలందరూ తన్మయత్వం పొందారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి ధరావత్ సరోజిని శంకర్ నాయక్ మాట్లాడుతూ రామాయణంలో రాముడు, సీతా దేవి , లక్ష్మణుడు, భరత, శత్రజ్ఞులు హనుమంతుడు. ఈ స్వామి వార్ల పాత్రధారులల్లో హిందూమతంలోని ఔన్నత్యాన్ని భార్యాభర్తల యొక్క ప్రేమానురాగాలను , అన్నదమ్ముల యొక్క అనుబంధాన్ని, హనుమంతుని యొక్క భక్తి భావాన్ని, ఆడవారి జోలికి వచ్చి అడ్డ మొరిగిన రావణబ్రహ్మ వృత్తాంతాన్ని ఇలా చెప్పుకుంటూ పోతే రామాయణం ఆనాటి నుండి ఈనాటి వరకు ప్రజల గుండెల్లో మనసుల్లో ఇంకా మెదులుతూనే ఉంటూ రాముడి యొక్క నడి ఆడిన మన భారత దేశ భూభాగంలో ఇంకను ప్రతి సంవత్సరం శ్రీరామనవమి వేడుకల సందర్భంగా సీతారాముల స్వాముల వారికి కళ్యాణ మహోత్సవం జరుపుతూనే ఉన్నాం కాబట్టి రాముని అడుగుజాడల్లో నడుస్తూ భక్తి పారవశంతో అన్ని కుటుంబాలు ఉండాలి అని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామంలోని చిన్నలు పెద్దలు కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అందరూ ఒకే చోటకి చేరి శ్రీ సీతారాముల కళ్యాణానికి హాజరై వేద పండితులు స్వామి వార్ల కళ్యాణాన్ని నిర్వహిస్తుండగాభక్తి పారవశ్యాలతోస్వామివార్ల కళ్యాణాన్ని ప్రజలందరూ తిలకించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ ఉమా బద్రి, వార్డు మెంబర్స్ , గ్రామ పెద్దలు గండ్ర గోపాలరావు అప్పారావు షేక్ మల్సూరు గట్టిగుండ్ల మల్సూరు ఉపేందర్ రంగు జనార్ధన చారి మైసయ్య మాజీ సర్పంచ్ కరుణ నారాయణ కైలాసపూర్ నారాయణరావు గుర్రాల మలుసూరు ధరావత్ హుస్సేన్ మాజీ ఎంపీటీసీ ధరావత్ శంకర్ తాళ్లపల్లి కృష్ణయ్య షేక్ బాబు షేక్ రంజాన్ ధరావత్ నగేష్ బొమ్మనపల్లి పెద్ద పుల్లయ్య బొమ్మనపల్లి కుశలవ వాంకుడోత్ జమ్లా నాయక్ గట్టిగుండ్ల మధు మెకానిక్ జిల్లేపల్లి వీరన్న సైదులు ఎల్లి మల్ల శ్రీనివాసరావు షేక్ అక్బర్ ఎల్లి మల్ల కృష్ణ తదితరులు పాల్గొని రాములోరి కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా జరిపించారు.
Admin
DNB News