DNB News - తెలంగాణ / : ప్రజా పాలనా ప్రగతి ప్రణాళిక 99 రోజుల ప్రణాళిక పంచాయతీరాజ్ శాఖ మార్చ్ 3 నుండి 15 వ తేది వరకు చేపట్టే పరిశుభ్రత, పారిశుద్యం కార్యక్రమం లో. ఈ రోజు ప్రణాళిక లో భాగంగా గ్రామ పంచాయతీ పరిసరాలను సిబ్బంది తో కలిసి నర్సింహా పురం సర్పంచ్ డాక్టర్ వేమూరి సత్యనారాయణ ఇతర అధికారులు మరియు గ్రామ పంచాయతీ సిబ్బంది తో కలిసి స్వయంగా పరిసరాలను శుభ్రం చేయటం జరిగింది. ఈ సందర్బంగా సర్పంచ్ మాట్లాడుతూ ప్రతి పౌరుడు, ప్రజా ప్రతినిధులు, అధికారులు స్వయంగా ఇందులో భాగస్వామ్యం కావాలని అన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న. 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం. విజయవంతం చేసేందుకు. ప్రతి ఒక్కరు క్రుషి చేయాలని. మన పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నప్పుడే మనము ఆరోగ్యవంతంగా ఉంటామని అందుకే ప్రతి కుటుంబం మరియు అధికారిక భవనాలు పరిసర ప్రాంతాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి పచ్చిపాల వెంకటేశ్వర్లు,గ్రామ లైన్మెన్ నరేష్ గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
Admin
DNB News