Friday, 18 September 2026 06:47:40 AM
# చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీ ఆత్మహత్య # ఏపీలో గంజాయి సేవించేవారిని పట్టిస్తే.. రూ.1,500 రివార్డ్! # మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు..

దోశా తినిపిస్తానని చెప్పి తీసుకెళ్లి ముగ్గురు చిన్నారుల ప్రాణాలు తీసిన ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది

Date : 09 March 2026 10:08 AM Views : 120

DNB News - తెలంగాణ / : దోశా తినిపిస్తానని చెప్పి తీసుకెళ్లి ముగ్గురు చిన్నారుల ప్రాణాలు తీసిన ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. తల్లిదండ్రులు చేసే తప్పులకు అమాయక పిల్లలు బలవుతున్న దారుణ ఘటనగా ఇది మారింది. కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నవాళ్లే, అభం శుభం తెలియని వయసులో ఉన్న చిన్నారుల ప్రాణాలను తీసేయడం సమాజాన్ని కలచివేస్తోంది. అమ్మా.. నాన్నా.. అని దీనంగా రోదిస్తూ ఊపిరాడక గిలగిలా కొట్టుకుంటూ ప్రాణాలు విడిచిన ఆ చిన్నారుల పరిస్థితి ఎంత హృదయ విదారకమో మాటల్లో చెప్పలేం. పిల్లలను ప్రేమగా పెంచి రక్షించాల్సిన తల్లిదండ్రులే ఇలా వారి జీవితాలను ముగించేయడం అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది. తమ జీవితం ఎలా ఉందో తెలిసినప్పుడే, పిల్లలను పోషించే స్థోమత లేదని ముందే తెలుసుకున్నప్పుడే ఎందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒకరి వెంట ఒకరిని కనిపెంచి, ఆ తర్వాత బాధ్యతలు మోయలేమని అమాయక చిన్నారుల ప్రాణాలు తీసే హక్కు ఎవరు ఇచ్చారు అని సమాజం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ మధ్యకాలంలో ఇలాంటి ఘటనలు వరుసగా వెలుగులోకి వస్తుండటం తల్లిదండ్రులపై కూడా భయం కలిగించే పరిస్థితిని తీసుకొస్తోంది. మానసిక ఒత్తిడి, కుటుంబ కలహాలు, అక్రమ సంబంధాలు, ఆర్థిక సమస్యలు – కారణం ఏదైనా సరే, చివరికి పిల్లల ప్రాణాలే బలి కావడం ఆందోళన కలిగిస్తోంది. ఇక్కడ చదువుకున్న వారు, సంపన్నులు, పేదవారు అనే తేడా కూడా కనిపించడం లేదు. ఉన్నత ఉద్యోగాలు, ఆస్తిపాస్తులు, అన్ని సదుపాయాలు ఉన్నవాళ్లు కూడా మానసిక సమస్యలతో ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్న ఉదాహరణలు పెరుగుతున్నాయి. అమాయక చిన్నారుల ప్రాణాలను కాపాడటం ప్రతి తల్లిదండ్రి తొలి బాధ్యత అని నిపుణులు చెబుతున్నారు. కుటుంబ సమస్యలు ఎంత పెద్దవైనా, వాటి పరిష్కారం పిల్లల ప్రాణాలు తీయడం కాదని, సమస్యలు ఉంటే కౌన్సెలింగ్ తీసుకోవాలని, సమాజం సహాయం కోరాలని వారు సూచిస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కుటుంబ విలువలు, మానసిక ఆరోగ్యంపై అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని సామాజిక వేత్తలు అభిప్రాయపడుతున్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :