Tuesday, 21 April 2026 03:33:59 PM
# సిద్ధమైన ఉర్దూ గర్ల్స్ కాలేజీ ప్రారంభం ఎప్పుడు? విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుతున్నారా?”.. SDPI.. # శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని వైఎస్సార్ సీపీ పార్టీ కార్యాలయంలో జరిగిన సంస్థాగత నిర్మాణాల వెరిఫికేషన్ ప్రక్రియ మరియు సమీక్ష సమావేశo # శాతవాహనలో “అగ్నిమాపక వారోత్సవాల అవగాహన కార్యక్రమం # మొక్కజొన్న వరి ధాన్యపు కొనుగోలు కేంద్రాల ప్రారంభం # కరీంనగర్‌లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం # కరీంనగర్‌లో ఘనంగా కార్తికేయ జువెలరీస్ ప్రారంభోత్సవం అజ్మత్పుర # ఇంటర్ ఫలితాల్లో మైనారిటీ గురుకుల విద్యార్థులకు మెరుగైన ఫలితాలు . # ఆలూరులో చంద్రబాబు జన్మదిన వేడుకలు వైభవంగా నిర్వహణ.. # కారుణ్య నియామకాలతో అభ్యర్థులకు ఉద్యోగ భద్రత... # వెంకట్రాంపురం గ్రామపరిధిలోని ఎస్.ఎం.పేట చలివేంద్రం ఘన ప్రారంభం...! # అమెరికా - ఇరాన్ మధ్య రెండో దశ శాంతి చర్చలు # కోర్టు దిక్కరణ కేసులో ఆర్డీవోకు జైలు శిక్ష # పారిశుధ్యం ప్రాధాన్యంతో డెంగ్యూ, మలేరియా వ్యాధులకు అడ్డుకట్ట… స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ శ్రీజ # ప్రజా వినతులను సత్వరమే పరిష్కరించాలి... అదనపు కలెక్టర్ లు # పనులు నాణ్యతతో నిర్ణీత కాలంలో పూర్తి చేయాలి # ప్రైవేటు ట్రావెల్స్ కు కళ్లెం.. 'ఒకే దేశం, ఒకేవిధానం' రద్దు # నిర్మల్ పోలీస్... మీ పోలీస్ # రైలు ప్రయాణంలో చెత్త వేస్తే భారీ జరిమానా # ఇతను తండ్రి కాదు....కూతుళ్ళ పాలిట యముడు ....కవల కుమార్తెల గొంతులు కోసి హత్య చేసిన తండ్రి # కర్నూలులో మహాత్మా బసవేశ్వర 893వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ..

శాతవాహనలో “అగ్నిమాపక వారోత్సవాల అవగాహన కార్యక్రమం

Date : 21 April 2026 09:41 AM Views : 3

DNB News - తెలంగాణ / : శాతవాహన విశ్వవిద్యాలయంలో ప్రగతి పథంలో తెలంగాణ అగ్నిమాపక శాఖ సంసిద్ధత అనే అంశంపై తెలంగాణ ఫైర్, డిజాస్టర్ రెస్పాన్స్, ఎమర్జెన్సీ & సివిల్ డిఫెన్స్ శాఖ, నిర్వహించిన అగ్నిమాపక భద్రత వారోత్సవాల లో భాగంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ లైబ్రరీ ఆడిటోరియంలో విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ఆచార్య సతీష్ కుమార్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం జరగగా మాట్లాడుతూ అగ్ని ప్రమాదాలను నివారించడానికి భవిష్యత్తు ప్రణాళికతో ముందుకు వెళ్లాలని అందరూ సంసిద్ధులై ఉంటేనే ప్రమాదాలను నివారించవచ్చని తెలియజేశారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఉపకులపతి ఆచార్య ఉమేష్ కుమార్ మాట్లాడుతూ మన విశ్వవిద్యాలయాన్ని అగ్ని ప్రమాదాల నుండి కాపాడుకోవడానికి మనమే నడుం బిగించుకోవాలని ప్రత్యేకంగా పర్యావరణాన్ని కాపాడుకోవడానికి వివిధ రకాల జంతువులను రక్షించడానికి ప్రమాదాల నివారణకు సంబంధించిన అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవాలని గత సంవత్సరం కొన్ని వన్యప్రాణులు కార్చిచ్చు వల్ల చనిపోవడం చాలా బాధ కలిగించిందని అందువల్లనే మిషన్ భగీరథ పైప్లైన్ సాయంతో విశ్వవిద్యాలయంలోని అన్ని ప్రధాన కళాశాలల వద్ద వాటర్ పాయింట్స్ పెట్టామని దీనివలన అగ్ని ప్రమాదాలను కొంతవరకు నివారించడం సులభమవుతుందని తెలియజేస్తూ రెండవ ఫైర్ స్టేషన్ ని కూడా కరీంనగర్లో ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు పంపించామన్నారు. ప్రత్యేక అతిథిగా విచ్చేసిన జిల్లా ఫైర్ ఆఫీసర్ శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ విశ్వవిద్యాలయంలో వసతి గృహాలలో కానీ ప్రయోగశాలలో కానీ విద్యార్థులు చాలా అప్రమత్తంగా ఉండాలని ముందస్తు జాగ్రత్త తోనే మనం ప్రమాదాలను నివారించవచ్చని తెలియజేస్తూ భారతదేశంలో ప్రతిరోజు 35 మంది అగ్ని ప్రమాదాల బారిన పడి చనిపోతున్నారని అందులో 80% హానికరమైన పొగ రసాయనిక మిశ్రమాల వలన ఊపిరాడక చనిపోతున్నారని దీనిపై అవగాహన చాలా అవసరమని తెలియజేస్తూ వివిధ రకాల అగ్ని ప్రమాదాలకు సంబంధించిన జాగ్రత్తలను గురించి, వాటిని ఎదుర్కోవడానికి కావలసిన మెలకువలను గురించి చర్చించారు. ఈ కార్యక్రమంలోఅతిథులుగా డా. డి.హరికాంత్ ఓ ఎస్ డి టు వి సి, డా. ఎస్. రామకాంత్ సైన్స్ కళాశాల ప్రిన్సిపల్, డా. కె. పద్మావతి ఆర్ట్స్ లా కళాశాల ప్రిన్సిపల్ పాల్గొని ప్రమాదాల విపత్తు నివారణ కొరకు తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సైన్స్ కళాశాల అధ్యాపకులు ఆర్ట్స్ కళాశాల అధ్యాపకులు కామర్స్ కళాశాల అధ్యాపకులతో పాటు మూడు కళాశాలల విద్యార్థిని విద్యార్థులు పాల్గొని అవగాహన పెంచుకున్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :