DNB News - తెలంగాణ / : బీసీవై పార్టీ ధర్మ దీక్షలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ మంగళగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు జనసేన నాయకులు. అనుచిత వ్యాఖ్యలు చేసిన శ్రీనివాస్ యాదవ్, తెలిసి కూడా మాట్లాడారు. ఈరోజు బీసీ ధర్మ దీక్ష చేస్తున్న బోడే రామచంద్ర యాదవ్, 2014లో జనసేన పార్టీ బి-ఫారంపై పుంగనూరు నుండి పోటీ చేసిన వ్యక్తి అని తెలుసుకోండి. 2014లో పార్టీ స్థాపించబడినప్పటి నుండి 2024 వరకు పార్టీ అధికారంలో వచ్చేవరకు బీసీలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ వస్తున్న జనసేన పార్టీ. జనసేన పార్టీ అధికారంలో కి వచ్చిన తర్వాత కూడా బీసీలకు ప్రాధాన్యత ఇచ్చిన పార్టీ జనసేన పార్టీ. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ బీసీలకు ప్రాధాన్యతనిచ్చిన జనసేన పార్టీ ఊరకనే అవాకులు చవాకులు పేలితే ఊరుకునే పరిస్థితులు లేవు ఒక పార్టీ అధినేత కాదు ఒక రాష్ట్రానికి డిప్యూటీ సీఎం నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు శ్రీనివాస్ యాదవ్ మా నాయకుడు నేర్పిన సిద్ధాంతం ప్రకారమే మేము నడుస్తాము ఈరోజు ఎవరు ఏమి చేసినా చట్టపరమైన చర్యలు తీసుకుంటాము
Admin
DNB News