DNB News - తెలంగాణ / : మహబూబాబాద్ జిల్లా కేంద్రం లోని మహబూబాబాద్ మున్సిపాలిటీ లో మరో అవినీతి బాగోతం వెలుగులోకి వచ్చింది, మహ-బాద్ మున్సిపాలిటీ కి సంబందించిన వాహనాలు అయిన చెత్త సేకరించెటి ట్రాక్టర్ లు, ఆటో లు, స్వాచ్ భారత్ రిక్షాలు పాడయి పోయిన మరియు రిపేర్ లు వచ్చిన వాహనాల విడి భాగాలను అన్ని సేకరించి ప్రభుత్వ అనుమతి తో వేలంపాట వేసి వచ్చిన ఆదాయం ప్రభుత్వ ఖజానా లో జమ చేస్తారు, కానీ మన మహబూబాబాద్ మున్సిపాలిటీ లో మాత్రం అందుకు భిన్నంగా ఎలాంటి ఆర్డర్ మరియు తీర్మానం లేకుండా అడ్డదారి లో శానిటరీ జవాన్ పోస్ట్ లోకి వచ్చిన ఒక శానిటరీ జవాన్ మహ-బాద్ టౌన్ లో గల నర్సంపేట రోడ్డు లో స్థూపం దగ్గర గల పాత ఇనుపకొట్టు షాపు లో చెత్త సేకరించే వాహనాల యొక్క విడి భాగాలను అనగా చెత్త ట్రాక్టర్ డోర్ లు, ఆటో డోర్ లు, వాహనాల రిపేర్ చేసిన విడి బాగలు ఎలాంటి ప్రభుత్వ అనుమతి లేకుండా, దొంగ చాటుగా ది. 01.02.2026 నాడు అమ్ముకొని ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టి బారి అవినీతి కి పాల్పడినాడు, ఇతను గతం లో పాడయి పోయిన స్వాచ్చ భారత్ రిక్షాలు వివేకానంద సెంటర్ నుండి అనుమతి లేకుండా అక్రమంగా తరలించి అమ్ముకున్నాడని తోటి శానిటరీ సిబ్బంది మాట్లాడుకుంటున్నాను, ఇంత అవినీతికి పాల్పడుతున్నా సరే, చూసి చూడనట్లు వ్యవహరిస్తూ ఇతన్ని కాపాడుతున్న ఆ అధికారి ఎవరో అని ఇతని అవినీతి బాగోతనికి అధికారుల అండ దండలు ఉన్నాయేమో అని అనుమానం గా ఉంది, ఈ అవినీతి జవాన్ గారు డ్యూటీ కి రాని శానిటరీ సిబ్బంది కి హాజరు పట్టికలో హాజరు వేస్తూ వారి కి పుల్ జీతం చేస్తూ, వారి దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నాడని తోటి సిబ్బంది మాట్లాడుకుంటున్నారు, అధికారులు హాజరు పట్టిక ను మరియు బయోమెట్రిక్ హాజరు ను సరిపోల్చి చూస్తే ఇతని బాగోతం బయట పడుతుంది, మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ గారు ఈ అవినీతి శానిటరీ జవాను పై విచారణ జరిపి అవినీతికి పాల్పడిన జవాన్ పై క్రిమినల్ చర్యలు తీసుకొని కేసు నమోదు చేయాలని, మన మహబూబాబాద్ మున్సిపాలిటీ లో ఎలాంటి అవినీతికి తావులేకుండా చూడాలని మహబూబాబాద్ పట్టణ ప్రజలు కోరుకుంటున్నారు.
Admin
DNB News