Wednesday, 17 June 2026 07:33:36 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

ఆసుపత్రిలో చోరీ కేసును ఛేదించిన మియాపూర్ పోలీసులు

Date : 04 March 2026 10:31 AM Views : 66

DNB News - తెలంగాణ / : - 7 తులాల బంగారం రికవరీ మదీనగూడలోని ఓ ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రిలో రోగుల సహాయకుల అజాగ్రత్తను ఆసరాగా చేసుకుని వరుస చోరీలకు పాల్పడుతున్న మహిళను మియాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. మియాపూర్ డిటెక్టివ్ ఇన్ స్పెక్టర్ రమేష్ నాయుడు తెలిపిన వివరాల ప్రకారం.. చందానగర్ శివాజీ నగర్‌కు చెందిన జె. దుర్గ (45) అనే మహిళ అదే ఆసుపత్రిలో హౌజ్ కీపింగ్ సిబ్బందిగా పనిచేస్తూ, సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశతో ఈ నేరాలకు పాల్పడుతున్నట్లు విచారణలో తేలింది. గత నెల ఫిబ్రవరి 25న, చందానగర్ అపర్ణ హిల్ పార్క్‌కు చెందిన ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ తన భార్య చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేరారు. ఆమె ఎస్‌ఐసీయూలో ఉండగా, ఆయన గదిలో ఒంటరిగా ఉన్న సమయంలో నిందితురాలు కేవలం ఐదు నిమిషాల వ్యవధిలో (రాత్రి 8:51 నుండి 8:56 మధ్య) లోపలికి ప్రవేశించి, బ్యాగులో భద్రపరిచిన 3 తులాల గొలుసు, 3 తులాల గాజులు, ఒక తులం చెవి రింగులతో పాటు 3 తులాల వెండి వస్తువులను అపహరించింది. మరుసటి రోజు ఉదయం బాధితుడు తన వస్తువులు పోయినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న మియాపూర్ పోలీసులు, డీఐ రమేష్ నాయుడు నేతృత్వంలో ఆసుపత్రిలోని సీసీటీవీ కెమెరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. నిందితురాలు అనుమానాస్పదంగా గదిలోకి వెళ్లడం, విధి ముగిసిన తర్వాత భద్రతా సిబ్బందికి తన సంచిని చూపించకుండా తనిఖీల నుండి తప్పించుకోవడం కెమెరాలో రికార్డ్ అయ్యింది. సాంకేతిక ఆధారాల సహాయంతో పోలీసులు ఆమె నివాసంలోనే అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ఆమె తన నేరాన్ని అంగీకరించింది. స్వాధీనం చేసుకున్న సొత్తు: నిందితురాలి వద్ద నుండి సుమారు 7 తులాల బంగారు ఆభరణాలు మరియు 2.5 తులాల వెండి వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసును అత్యంత వేగంగా ఛేదించి, బాధితులకు న్యాయం చేసిన పోలీసు సిబ్బందిని ఉన్నతాధికారులు ప్రత్యేకంగా అభినందించారు. ప్రజలు, ఆసుపత్రి యాజమాన్యాలకు సూచనలు: ఆసుపత్రులకు వచ్చేటప్పుడు విలువైన ఆభరణాలు, భారీ నగదు వెంట తీసుకురావద్దు. ఆసుపత్రి యాజమాన్యాలు తమ సిబ్బందిపై నిఘా ఉంచాలన్నారు. సీసీటీవీ కెమెరాలు నిరంతరం పనిచేసేలా చూసుకోవాలని సూచించారు. ఏదైనా అనుమానాస్పద వ్యక్తి లేదా సంఘటన కనిపిస్తే తక్షణమే పోలీసులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: