DNB News - తెలంగాణ / : కరీంనగర్లో ఘనంగా కార్తికేయ జువెలరీస్ ప్రారంభోత్సవం అజ్మత్పుర, ఎస్ బి ఐ బ్యాంక్ టవర్ సర్కిల్ బ్రాంచ్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన 'కార్తికేయ జువెలరీస్' షోరూమ్ను సోమవారం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఘనంగా ప్రారంభించారు. రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం, ఆయన షోరూమ్లోని నూతన ఆభరణాల కలెక్షన్ను ఆసక్తిగా పరిశీలించారు. ఈ సందర్భంగా షోరూమ్ యజమాని మల్యాల ప్రభాకర్ మాట్లాడుతూ వినియోగదారులకు నమ్మకమైన నాణ్యతతో పాటు, సరసమైన ధరలకే అద్భుతమైన డైమండ్స్, వివిధ రకాల రింగ్స్ మరియు అత్యాధునిక డిజైన్లను అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు.ఈ ప్రారంభోత్సవ వేడుకలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్తో పాటు కరీంనగర్ నగర మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ వై. సునీల్ రావు , రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి , స్థానిక కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, ప్రముఖ వ్యాపారవేత్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నగర ప్రజలకు నాణ్యమైన బంగారు, వజ్రాల ఆభరణాలను అందించాలనే లక్ష్యంతో ఈ షోరూమ్ ప్రారంభించినట్లు యాజమాన్యం పేర్కొంది.
Admin
DNB News