DNB News - తెలంగాణ / : మునగాల:తెలంగాణరాష్ట్రరైతు సంఘం సూర్యాపేట జిల్లా సహాయ కార్యదర్శిగా మునగాల మండలం కొక్కిరేణి గ్రామానికి చెందిన మేదరమెట్ల వెంకటేశ్వరరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు, ఆదివారం జిల్లా పరిధిలోని నెమ్మికల్ గ్రామంలో నిర్వహించిన తెలంగాణ రాష్ట్రరైతుసంఘం సూర్యాపేట జిల్లా మూడవ మహాసభల్లో,మహాసభకు హాజరైన రైతు సంఘం ప్రతినిధులు తనను సూర్యాపేట జిల్లా రైతు సంఘం సహాయ కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఆయన తెలిపారు, మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కొక్కిరేణి లిఫ్ట్ ఇరిగేషన్ చైర్మన్ గా, కొక్కిరేణి పిఎసిఎస్ చైర్మన్ గా సుదీర్ఘకాలం పనిచేస్తూ మండలంలోని రైతాంగ సమస్యల పరిష్కారం కోసం అనేక ప్రజాఉద్యమాలలో ప్రత్యక్షంగా పాల్గొంటూ రైతు సంఘం బలోపేతం కోసం పనిచేస్తున్న తనను జిల్లా సహాయ కార్యదర్శిగా ఎన్నుకున్న రైతుసంఘం ప్రతినిధులకుఆయన ఈసందర్భంగా విప్లవ ధన్యవాదాలు తెలిపారు,రానున్న కాలంలో తెలంగాణ రాష్ట్ర రైతుసంఘం నిర్వహించే రైతాంగ ఉద్యమాలకు నాయకత్వం వహిస్తూక్షేత్రస్థాయిలో రైతుల్ని సమీకరించి రైతు పండించిన పంటకుగిట్టుబాటు ధర కోసం, కనీసం మద్దతు ధర కోసం, పెండింగ్లో ఉన్న బస్తాకు 500 రూపాయలబోనస్ నిధుల విడుదల కోసం, రైతుబంధు, రైతు బీమా తదితర అంశాలపై ఉద్యమాలు నిర్వహిస్తూ ముందుకుసాగుతానని ఆయన ఈసందర్భంగా తెలిపారు,
Admin
DNB News