DNB News - తెలంగాణ / : ♦ సేవాలాల్ సేన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బాణోత్ హుస్సేన్ నాయక్ ఆధ్వర్యంలో. "గౌరవ స్పీకర్ "శ్రీ గడ్డం ప్రసాద్ ని కలిసి వినతిపత్రం సమర్పించడం జరిగింది.✉️ విషయం: తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం చేవెళ్లలో ప్రకటించిన ఎస్టీ డిక్లరేషన్లో గిరిజనులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, మరియు వాటిని అసెంబ్లీలో ప్రస్తావించాలని వినతి. ✉️ ♦ ప్రధాన డిమాండ్లు ... 1️⃣ శ్రీశ్రీశ్రీ సద్గురు సంత్ సేవాలాల్ మహారాజ్ గౌరవార్థం,, జయంతి నిధులుగా రూ. 2.5 కోట్లు వెంటనే విడుదల చేయాలి హైదరాబాద్లో శ్రీశ్రీశ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ విగ్రహం ఏర్పాటు చేయాలి సేవాలాల్ ట్రైబల్ మ్యూజియం స్థాపించాలి . 2️⃣ తండా పంచాయతీల అభివృద్ధి ప్రతి తండా పంచాయతీకి రూ. 25 లక్షలు నిధులు వెంటనే విడుదల చేయాలి. 3️⃣ గిరిజన నిధుల పరిరక్షణ గిరిజనులకు కేటాయించిన బడ్జెట్ నిధులను దారి మళ్లించడం ఆపాలి ఎస్సీ/ఎస్టీ సబ్ ప్లాన్ను పకడ్బందీగా అమలు చేయాలి. 4️⃣ ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధి GO No. 3 పునరుద్ధరించాలి ఏజెన్సీ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలి. 5️⃣ ఉద్యోగావకాశాలు గిరిజన శాఖలలో ఉన్న బ్యాక్లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి. 6️⃣ చేవెళ్ల ఎస్టీ డిక్లరేషన్ అమలు చేవెళ్లలో ప్రకటించిన ఎస్టీ డిక్లరేషన్ హామీలను వెంటనే అమలు చేయాలి. ⚠️ ప్రత్యేకంగా గమనించవలసిన అంశం,, ♦గత రెండు సంవత్సరాలుగా గిరిజనులకు కేటాయించిన బడ్జెట్ను సక్రమంగా వినియోగించకుండా దారి మళ్లించిన విషయంపై అసెంబ్లీలో సమగ్ర చర్చ జరపాలని సేవాలాల్ సేన తెలంగాణ రాష్ట్ర కమిటీ తరఫున ఈ రోజు వారిని కలవడం జరిగింది ఈ కార్యక్రమంలో సేవాలాల్ సేన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు "శ్రీ బాణోత్ హుస్సేన్ నాయక్ గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోహన్ నాయక్ గారు, రాష్ట్ర కార్యదర్శి జర్పుల లాలు ప్రసాద్ నాయక్ గారు, రాష్ట్ర సహాయ కార్యదర్శి, సుమన్ నాయక్ గారు, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ జవహర్లాల్ నాయక్ , గ్రేటర్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి రాజు నాయక్ , యువసేన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కృష్ణ నాయక్ , విద్యార్థి సేన వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ నాయక్ నిజం కాలేజ్ అధ్యక్షులు అరుణ్ నాయక్ , మరియు సేవాలాల్ సేన సైనికులు ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు. జై" సేవాలాల్ జై" జై" సేవాలాల్ ,, ????????????????
Admin
DNB News