Monday, 16 March 2026 03:49:19 PM
# ఉప్పల్‌లో హత్య కేసు – 6 గంటల్లోనే నిందితుల అరెస్ట్ # భారత రక్షణ రంగంలో మరో కీలక ముందడుగు… # ప్రెస్ ఆహ్వానం మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ కార్యక్రమాలు. # భగత్ సింగ్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ సందర్భంగా డ్రగ్స్ ఘటనపై తీవ్ర వ్యాఖ్యలు # టెన్త్ పరీక్షలకు సిద్ధమైన విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ – SFI జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు.. # తెలంగాణ జాగృతి కార్యాలయం, బంజారాహిల్స్.-కవిత ప్రెస్ మీట్. # అమరావతి : చంద్రబాబుపై రాళ్ల దాడి ఘటన నిందితులకు హైకోర్టు షాక్..! # మద్యం మత్తులో జాతీయ రహదారిపై నిద్రపోయిన మందుబాబు # అస్సాంలోని టిన్సుకియాలో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ATM లోకి ఒక ఎలుక దూరీ దాదాపు 17 లక్షల నగదును కొరికేసింది # ఖమ్మం కొత్త బస్టాండ్ లో మణుగూరు భద్రాచలం కొత్తగూడెం వెళ్లే పాయింట్స్ దగ్గర పైన ఫ్యాన్ తిరగట్లేదు # కర్నూలు జిల్లాలో మెగా కార్డన్ సెర్చ్ ఆపరేషన్ – 69 వాహనాలు స్వాధీనం, డ్రోన్‌లతో ప్రత్యేక నిఘా # పదవ తరగతి పరీక్షలకు కర్నూలు జిల్లాలో పటిష్ట బందోబస్తు – పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్.. # ఆసియన్ గేమ్స్‌లో గోల్డ్ మెడల్ సాధించిన దొడ్డి బెలగల్ యువకుడు హుస్సేన్.. # కూటమిని విడగొట్టాలని వైఎస్సార్సీపీ కుట్ర: ఎమ్మెల్యే పార్థసారథి.. # జర్నలిజంలో రెండు స్వర్ణ పతకాలు సాధించిన తస్లీమాకు ఎమ్మెల్యే డా. పార్థసారధి అభినందనలు.. # బాలికపై లైంగిక దాడి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది # మహబూబాబాద్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది # తండ్రి మరణాన్ని దిగమింగుకుని పదో తరగతి పరీక్షకు హాజరైన విద్యార్థి # పాకిస్తాన్ గూఢచర్యం కేసు – యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు బెయిల్ నిరాకరణ # సీపీఐ(ఎం) నేత తమ్మినేని వీరభద్రం ఆస్పత్రిలో చికిత్స

భగత్ సింగ్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ సందర్భంగా డ్రగ్స్ ఘటనపై తీవ్ర వ్యాఖ్యలు

Date : 16 March 2026 09:42 AM Views : 6

DNB News - తెలంగాణ / : హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న భగత్ సింగ్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ సందర్భంగా డ్రగ్స్ ఘటనపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు సీపీఐ జాతీయ నాయకులు. డ్రగ్స్ సేవిస్తూ పట్టుబడిన టీడీపీ ఎంపీ పుట్ట మహేష్, మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పై కఠిన చర్యలు తీసుకుని వారిని సస్పెండ్ చేయాలని సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్ ఛైర్మెన్ కె. నారాయణ డిమాండ్ చేశారు. ఏఐవైఎఫ్ హైదరాబాద్ జిల్లా సమితి ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ సీ గ్రౌండ్స్‌లో నిర్వహిస్తున్న భగత్ సింగ్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ నాలుగో రోజు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా క్రీడాకారులతో కరచాలనం చేసి, అద్భుతమైన బ్యాటింగ్, బౌలింగ్‌తో కొద్దిసేపు వారితో కలిసి మ్యాచ్ ఆడి ఉత్సాహాన్ని నింపారు. ఈ సందర్భంగా మాట్లాడిన నారాయణ దేశంలో క్రీడల అభివృద్ధి విషయంలో ప్రభుత్వాల వైఖరిని తీవ్రంగా విమర్శించారు. క్రీడలను కార్పొరేట్ లాభాల కోసం కాకుండా యువత అభివృద్ధి కోసం వినియోగించాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా ఐపీఎల్ పేరుతో క్రీడాకారులను సంతలో సరుకుల్లా వేలం వేయడం క్రీడాస్ఫూర్తికి విరుద్ధమని విమర్శించారు. యువతలో అపారమైన ప్రతిభ ఉన్నప్పటికీ ప్రభుత్వాలు క్రీడలకు తగిన ప్రాధాన్యత ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్నాయని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మైదానాలు, శిక్షణా కేంద్రాలు, క్రీడా సదుపాయాలు కల్పించడంలో పాలకులు విఫలమయ్యారని విమర్శించారు. యువత మాదకద్రవ్యాలు, బెట్టింగ్ సంస్కృతి వంటి దుష్ప్రభావాలకు దూరంగా ఉండాలని, క్రీడలు క్రమశిక్షణ, ఐక్యత, పోరాటస్ఫూర్తి పెంపొందించే గొప్ప సాధనమని నారాయణ పేర్కొన్నారు. భగత్ సింగ్ ఆశయాలు యువతకు ప్రేరణ కావాలని, క్రీడలు మరియు విద్య ద్వారా యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఉస్మానియా యూనివర్సిటీ ఉపకులపతి మొలుగురం కుమార్ మాట్లాడుతూ డ్రగ్స్ మరియు మాదకద్రవ్యాల వ్యసనం యువత భవిష్యత్తును నాశనం చేసే ప్రమాదకర సమస్యగా మారిందన్నారు. విద్యార్థులు అలాంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండి విద్యలో ముందుండాలని సూచించారు. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో యువత ముందుండాలని, ఈ దిశగా అవగాహన కల్పించడానికి నిర్వహిస్తున్న ఈ క్రికెట్ టోర్నమెంట్ అభినందనీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ మరియు ఏఐవైఎఫ్ నాయకులు, కార్యకర్తలు, క్రీడాకారులు పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :