DNB News - తెలంగాణ / : మైనార్టీ గురుకుల కళాశాలను విద్యార్థినీ విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి... మైనార్టీ గురుకుల కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పడిశెట్టి సంపత్.. తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించిన 2026 విద్య సంవత్సరానికి సంబందించిన ప్రథమ , ద్వీతీయ సంవత్సర ఫలితాల్లో మైనారిటీ గురుకుల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారని తెలంగాణ మైనారిటీ గురుకుల కళాశాల మానకొండూర్ బాలుర -1 ప్రిన్సిపాల్ డాక్టర్ పిడిశెట్టి సంపత్ తెలిపారు. ఎంపీసీ / బైపీసీ విభాగంలో హుజురాబాద్ బాలుర కళాశాలలో ద్వీతీయ సంవత్సరంలో ఎన్.రాజకుమార్ స్వామి 948 /1000 , అంజన్న 900 /1000 ఎం.రాహుల్ 916 /1000 , శ్రీనాథ్ రెడ్డి 913 /1000 అలాగే ప్రథమ సంవత్సరంలో మొహమ్మద్ హనీఫ్ 447 /470 , మొహమ్మద్ సమీర్ 445 /470 , షేర్ ఖాన్ 431 /440 , పి.రోహిత్ 431 /440 మార్కులు సాధించారని ప్రిన్సిపాల్ కుమారస్వామి తెలిపారు. ఆర్ట్స్ విభాగంలో మానకొండూర్ బాలుర కళాశాలలో ప్రథమ సంవత్సరంలో మనోజ్ 460 /500 , ఎండీ. రెహాన్ 446 /500 , రాజేష్ 442 /500 , ఎం.సాగర్ 433 /500 ద్వీతీయ సంవత్సరంలో ఎండీ. అష్రాఫ్ 866 /1000 , సి.హెచ్ చందు 857 /1000 , డి.అభిషేక్ 828 /1000 మార్కులు సాధించారని ప్రిన్సిపాల్ డాక్టర్ పిడిశెట్టి సంపత్ తెలిపారు. అదేవిధంగా బాలికల కళాశాలల్లో కరీంనగర్ గర్ల్స్ -2 ఎంపీసీ / బైపీసీ విభాగంలో ద్వీతీయ సంవత్సరంలో తబస్సుమ్ లారా 988 /1000 ,అఫ్రీన్ ఫాతిమా 982 /1000, సాజిదా 981 /1000 ఆలాగే 900 పైగా మార్కులు సాధించిన విద్యార్థులు సంఖ్య గణనీయంగా ఉన్నారని ప్రథమ సంవత్సరంలో అలీజా మరియం 459 /470 , మెహరోజ్ తంకీన్ 458 /470 , షైక్ సుహానా 450 /470 లతో 400 పైగా మార్కులు సాధించిన వారు 30 మంది ఉన్నారని ప్రిన్సిపాల్ ఎన్. సరిత ఈ సందర్భంగా తెలిపారు. ఆర్ట్స్ విభాగంలో చొప్పదండి బాలికల కళాశాలలో ద్వీతీయ సంవత్సరంలో జాస్మిన్ 965 /1000 , మౌనిక 959 /1000 , పావని 957 /1000 , శీరీన్ 950 /1000 , రుత్విక 933 /1000 మార్కులు సాధించారని ప్రిన్సిపాల్ జి.వారుణీ తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డాక్టర్ పిడిశెట్టి సంపత్ మాట్లాడుతూ విద్యార్థులు కృషి , ఉపాధ్యాయుల అంకితభావం, క్రమశిక్షణతో కూడిన విద్య విధానం వల్లే ఈ విజయాలు సాధ్యమయ్యాయని తెలిపారు. మైనారిటీ గురుకులాల కో ఆర్డినేటర్ రమేష్ లాల్ హత్కర్, విజిలెన్సు అధికారులు ఎం.డి . అక్రమ్ పాషా, ఇంతియాజ్ అలీ , అకాడమిక్ కో ఆర్డినేటర్ ఎం.డి మీరాజ్, ఉపాద్యాయులు, తల్లిదండ్రులు విద్యార్థులను అభినందించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , మైనారిటీ గురుకులాల సొసైటీ అధ్యక్షులు ఫహీమ్ ఖురేషి, సెక్రటరీ బి. షఫీఉల్లా , డి.ఐ .ఓ సుభాన్ లకు ప్రిన్సిపాళ్లు కృతఙ్ఞతలు తెలిపారు.మైనారిటీ గురుకులాల్లో ప్రవేశాలు కొనసాగుతున్నాయని ఇట్టి అవకాశాన్ని మైనారిటీలు వినియోగించుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు 7995057932 కు సంప్రదించాలని కోరారు.
Admin
DNB News